రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. సంగారెడ్డిలో బీజేపీ కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజ్ సందర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల సింగూరు, మంజీరా డ్యామ్లు నీళ్లు లేక మైదానాలుగా మారాయన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు దత్తాత్రేయ.