గుడివాడలో యువకుడి దారుణ హత్య

Update: 2019-08-17 05:55 GMT

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విరుచుకుపడ్డారు.. మెడపై నరికి చంపారు. హతుడి ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.. హత్యకు గురైన భార్గవ్‌ గతంలో ఓ హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా పోలీసులు గుర్తించారు.

Similar News