తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రాన్ని సీఎం అవినీతిమయంగా మార్చారని.. రాబందుల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్లో గ్రానైట్, ఇసుక మాఫియా సహజ సంపదను దోచేస్తోందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. పేదల సంక్షేమ స్కీంలన్నింటిలో స్కాంలే ఉన్నాయన్ని ఆరోపించారు. 15వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక వైద్యసేవలు నిలిపివేశారన్నారు.