వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయన్నారు.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నా పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లిందని... ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో సర్కారు నిర్ణయం తప్పని తేలిపోయిందన్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏ ల అంశంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర రాజధానిని మారుస్తామంటే ఊరుకునేది లేదన్నారు కన్నా లక్ష్మీ నారాయణ.