పోలవరం హైడల్ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లపై హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు మాజీమంత్రి దేవినేని ఉమ. రివర్స్ టెండరింగ్ వద్దని పోలవరం అథారిటీ చెప్పినా..అవగాహనారాహిత్యంతో జగన్ వ్యవహరించారని విమర్శించారు. గతంలో రాజశేఖర్రెడ్డి ఏం చేశారు..ఇప్పుడు జగన్ అలానే చేస్తున్నారని దేవినేని ఫైర్ అయ్యారు. ఏపీ జీవనాడి లాంటి ప్రాజెక్టును కోర్టుల వరకు తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు.