ప్రధాని మోదీ మరోసారి తన సింప్లిసిటీతో ఆకట్టుకున్నారు. కిందపడిపోయిన పువ్వును స్వయంగా తీసి ఆశ్చర్యపరిచారు. నేను ప్రధానిని, పువ్వు కిందపడిపోతే నేను తీయాలా అనే శషభిషలు పెట్టుకోకుండా పువ్వును తీసి పక్కనే ఉన్న అధికారికి అందించారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ హ్యూస్టన్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఈ సమయంలో ఓ ఆఫీసర్ మోదీకి వెల్కమ్ చెబుతూ పుష్పగుచ్చం అందించారు. అందులో నుంచి ఒక పువ్వు కిందపడింది. అది గమనించిన మోదీ సైనికాధికారితో కరచాలనం చేస్తూనే కిందికి వంగి పువ్వును తీశారు. ఆ సమయంలో యుఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్, అమెరికాలోని భారతీయ రాయభారి హర్ష్వర్థన్ అక్కడే ఉన్నారు.
Also watch :