హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మళ్లీ నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు.పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ స్తంభించిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అప్రమత్తం చేశారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.