కళ్లు తెరవని అధికారులు.. టీటీడీలో మరోసారి అన్యమత ప్రచారం

Update: 2019-10-11 07:17 GMT

ఎన్నిసార్లు తప్పులు జరిగినా టీడీడీ అధికారులు కళ్లు తెరవడం లేదు. తిరుమల కొండపై అన్యమత వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. అన్యమతానికి సంబంధించిన స్టిక్కర్లతో తిరుమలకు వాహనాలు చేరుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ వాహనంపై అన్య మతానికి చెందిన ఫొటోలు, శిలువ గుర్తులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్యమత వాహనాలను తిరుమలకు అనుమతించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News