ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు ఇష్టారీతిన బస్సులు నడుపుతున్నారు. కొందరు అజాగ్రత్తతో యాక్సిడెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు తాగి స్టీరింగ్ పడుతున్నారు. హైదరాబాద్ హయత్నగర్ సమీపంలో ఓ డ్రైవర్ .. బస్సు యూటర్న్ తీసుకునే క్రమంలో ఓ కారును ఢీకొట్టి డివైడర్ ఎక్కించేశాడు. బైక్పై వెళ్తున్న మరో వ్యక్తికి కూడా ఈ యాక్సిడెంట్లో గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఏకంగా 355 పాయింట్లు చూపించింది. పీకలవరకూ తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.