TSRTC కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిశీలించాలన్నారు. ఒకేసారి వేల మంది ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్కు జనసేన మద్దతిస్తోందన్నారు పవన్ కళ్యాణ్.