తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. స్కూళ్ల సెలవులు ముగుస్తుండడంతో ప్రత్యామ్నయ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఎండీని నియమించేందుకు కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్.. అధికారులు సునీల్ శర్మ, సందీప్ కుమార్ హాజరయ్యారు.