బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ మీటింగ్ను మెచ్చుకుంటూనే సెటైర్లు వేశారు చిరంజీవి కోడలు ఉపాసన. హిందీ కళాకారులతో మాత్రమే సమావేశం అయ్యారని ఆక్షేపించారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లేకుండా పోయిందని ఉపాసన గుర్తుచేశారు. నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇది తనను చాలా బాధిస్తోందని ఉపాసన ఆవేదన వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను సరైన స్ఫూర్తితో తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.
Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV
— Upasana Konidela (@upasanakonidela) October 19, 2019