విజయవాడ సింగ్నగర్ పీఎస్ పోలీసులతో అగిరిపల్లి పీఎస్ కానిస్టేబుల్ పరుశురామ్ గొడవకు దిగాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపాడు పరుశురాం. దీంతో.. కారు ఆపి కానిస్టేబుల్ పరుశురాంను ప్రశ్నించాడు ఓ యువకుడు. తనను ప్రశ్నించిన ఆ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో.. అతను పరుశురాంపై సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో.. సింగ్నగర్ పోలీసులు పరుశురాంను స్టేషన్ను పిలిచారు. దీంతో రెచ్చిపోయిన పరుశురాం.. మీ సంగతి తేలుస్తానంటూ.. సింగ్నగర్ ఎస్సై, కానిస్టేబుల్ను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. ఏసీపీని సైతం లెక్కచేయకపోవడంతో ఈ పంచాయితీ జిల్లా ఎస్పీ వద్దకు చేరింది. దీనిపై సమగ్ర నివేదిక తీసుకున్న కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు.. అగిరిపల్లి కానిస్టెబుల్ పరుశురాంను సస్పెండ్ చేశారు.