మంత్రి అవంతి ఇంటిని ముట్టడించిన కార్మికులు

Update: 2019-10-26 06:16 GMT

భవన నిర్మాణ కార్మికులు మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. తమకు ఉపాధి కల్పించాలంటూ మంత్రి నివాసం ముందు బైటాయించారు. ఇసుకను వెంటనే అందుబాటులోకి వచ్చేలా చేసి... తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రిని కలిసి తమ కష్టాలను వివరించారు. అయితే ఇసుక విధానంపై కొన్ని పార్టీలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని.. త్వరలోనే అంతా సర్దకుంటుందని మంత్రి అవంతి వారికి అభయమిచ్చారు.

Similar News