విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

Update: 2019-10-26 03:23 GMT

విశాఖపట్నం కశింకోట మండలం తాళ్లపాలెంలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని చింతపల్లిలో కొనుగోలు చేసి అక్కడ నుంచి చోడవరం, అనకాపల్లి మీదుగా బీహార్‌ తరలిస్తున్నారన్న సమచారంతో తాళ్లపాలెం వద్ద ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి 561 కేజీల గంజాయితో పాటు 50 వేల నగదును స్వాధీనం చేసుకుని.. లారీని సీజ్‌ చేశారు పోలీసులు.

Similar News