విశాఖలో బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని.. మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విషయంపై విశాఖ పోలీస్ కమీషనర్తో మాట్లాడతానన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం జగన్ కూడా సీరియస్గా ఉన్నారని మంత్రి తెలిపారు. ఆంధ్రా ఐడల్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. యువతలో టాలెంట్ను బయటకు తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు.