బాలికపై అత్యాచారం బాధాకరం: అవంతి శ్రీనివాస్

Update: 2019-10-31 08:14 GMT

విశాఖలో బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని.. మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విషయంపై విశాఖ పోలీస్‌ కమీషనర్‌తో మాట్లాడతానన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారని మంత్రి తెలిపారు. ఆంధ్రా ఐడల్‌ 2019 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. యువతలో టాలెంట్‌ను బయటకు తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు.

Similar News