పోరాటం తీవ్రతరం చేస్తాం: ఆర్టీసీ జేఏసీ

Update: 2019-11-02 12:00 GMT

అఖిలపక్షనేతలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు... తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 3 నుంచి తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. 3న పల్లెబాట, 4న డిపోల వద్ద నిరాహార దీక్షలు, 5న రహదారుల దిగ్బంధం, 6న కార్మికుల కుటుంబ సభ్యులతో నిరసన, 7న ప్రజాసంఘాల నిరసన, 9న ట్యాంక్‌బండ్‌పై దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని తెలిపారు. తమ డిమాండ్లు సాధించుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. 4, 5 తేదీల్లో ఢిల్లీ పెద్దలను కలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News