అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బిటి ప్రాజెక్టు గ్రామానికి చెందిన రైతు జయరాం రెడ్డి ఎమ్మార్వో ఆఫీసు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వైసీపీ నేతల ఒత్తిడితో తనకు ఇచ్చిన ఇంటి పట్టాను అధికారులు రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ నేతల ఒత్తిడితోనే జయరాం రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. జయరాం రెడ్డిని పోలీసులు రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.