ఏపీలో ఇసుక కొరతతో పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు నిర్వహిస్తోంది. జనసేన అధినేత పవన్ పిలుపుతో.. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చి ఆకలి తీర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ఇసుక సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు జనసేన నేతలు. కార్మికులకు నెలకు 10 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.