వైసీపీ ఎమ్మెల్యే కారు బోల్తా..

Update: 2019-11-20 02:27 GMT

శ్రీశైలం సమీపంలోని నంది ఘాటు మలుపు వద్ద పాణ్యం ఎమ్మెల్యేకి చెందిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వస్తే పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాటసాని అనుచరులు కారులో శ్రీశైలానికి బయల్దేరారు. నంది ఘాట్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.

Similar News