కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా విడుదలను ఆపివేయాలని హైదరాబాద్ కవాడిగూడలోని సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు ఇంద్రసేన చౌదరి, అడ్వకేట్ బాలాజీ. ఈ సినిమా రెండు సామాజిక వర్గాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. తక్షణమే సినిమా విడుదలను నిలిపివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరి మద్దతు పొందడానికి మరొకరిని కించపరిచేలా ఉన్న సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీనిపై సోమవారం హైకోర్టులో పిటిషన్ వేస్తానని తెలిపారు.