బ్రతుకు కోరిన బావమరిది కుటుంబంపై పగ పెంచుకున్న బావ.. ఏం చేశాడో చూస్తే..
సిద్దిపేట జిల్లాలో ఓ బావ.. బావమరిది కుటుంబంపై పగతో రగిలిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా.. బావమరిది కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండపాక మండలం ఖమ్మంపల్లిలో జరిగిన ఈ దారుణం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బావమరిది బతుకు కోరతాడని అంటారు. అలాంటి బావమరిది కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు బావ. పెట్రోల్ దాడికి పాల్పడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.