చివరి గడియల్లో చిలిపి కోరిక.. మనవడితో కలిసి..

Update: 2019-11-23 07:05 GMT

లైఫ్ హ్యాపీగానే సాగింది. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరికీ ఆస్తుల్ని, ఆప్యాయతల్ని పంచి ఇచ్చాడు. జీవితం సుఖంగా గడిచిపోయింది. అంతలోనే ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి బెడ్‌పై ఉండాల్సి వచ్చింది అమెరికా విస్కిన్‌సన్ సిటీకి చెందిన ఓ తాతగారు. అయనకున్న అనారోగ్య కారణాల రిత్యా ఎక్కువ రోజులు బతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేసారు. నామ మాత్రపు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కొడుకులను, మనవళ్లని దూరమవుతున్న క్షణాలు దగ్గరపడుతున్నాయని భావించిన తాతగారు ఓ మనవడిని పిలిచి మీ అందరితో కలిసి మందు కొట్టాలని ఉందని తన ఆఖరి కోరికను వెల్లడించారు. తాతగారి కోర్కెను తీర్చడానికి ఆ రాత్రి హాస్పిటల్ రూమ్‌ని బార్‌గా మార్చేశారు కుటుంబసభ్యులు. ఆయన సంతోషం కోసం అందరూ కలిసి ఓ పెగ్గేశారు. మర్నాటి ఉదయం తాత సంతోషంగా కన్నుమూశారు. అందరూ కలిసి బీరు తాగుతున్న ఫోటోను మనవడు ఆడమ్ స్కీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. చివరి గడియల్లో తాతగారి కోర్కెను తీర్చిన మనవడిని శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

Similar News