మోదీ ప్రసంగంపై జగన్ ఎలా స్పందిస్తారో వినాలని ఉంది: పవన్ కళ్యాణ్

Update: 2019-11-25 09:41 GMT

మానవహక్కుల ఉల్లంఘన రాయలసీమలోనే ఎక్కువగా జరిగిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. దళిత కులాల మీద దాడులు జరిగినా.. బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారని ట్వీట్‌ చేశారు పవన్‌. కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకం కవర్‌ పేజ్‌ను పోస్ట్‌ చేసి.. తన వ్యాఖ్యాల్ని ట్వీట్ చేశారు. 1996లో పౌర హక్కుల వారు ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటికి వస్తున్నాయని అన్నారు. ఇదే పుస్తకంలోని 75వ పేజీలో జగన్‌ రెడ్డిగారి ప్రస్తావన కూడా ఉందన్నారు.

ముఠా సంస్కృతి వల్లే రాయలసీమ వెనకబాటుకు కారణాలు అర్థమవుతాయన్నారు పవన్‌. దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌. పోరాట యాత్రలో యువత తనను కలిసి వారి బాధలు వెళ్లబోసుకుంటే.. నా గుండె కలిచివేసిందని ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌.

మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అమ్మభాషపై చేసిన ప్రస్తావనపై కూడా పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగంపై శ్రీ జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నట్టు సెటైర్‌ వేస్తూ ట్వీట్‌ చేశారు పవన్ కళ్యాణ్‌.

Similar News