ప్రియాంక ఉదంతంపై ఓ వైపు దేశమంతా అట్టుడుకుతుంటే..విజయవాడలో మరో ఈవ్ టీజర్ బరితెంగించాడు. కొంతకాలంగా వేధిస్తున్న సాయి చైతన్య అనే కీచకుడికి దేహశుద్ధి చేసిందో వివాహిత. కృష్ణాజిల్లా కొండపల్లి ఆరుపంపుల సెంటర్ వద్ద జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది..
సాయిచైతన్యను ఇప్పటికే పలుమార్లు మందలించిందా మహిళ. అయినా తీరు మారలేదు.. మరోసారి వేధింపులకు పాల్పడటంతో..ఆకతాయికి దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు సాయిని నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు..ఆ కీచకుడిని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు తరలించారు.