జగన్ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం అన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. ఈ ఆరు నెలల్లో ఏపీకి మొత్తం 67 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారాయన. రాష్ట్రంలో లక్ష బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం షాపుల పక్కనే బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతనికి పడిపోయిందన్న ఆయన.. 30 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నారు. మంచి ముఖ్యమంత్రి కాదు.. ముంచే ముఖ్యమంత్రి అనేందుకు ఇవే సాక్ష్యాలన్నారు దేవినేని ఉమ.