నితిన్ గడ్కరిని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

Update: 2019-12-03 06:42 GMT

 

తెలంగాణలో జాతీయ రహదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు టీఆర్‌ఎస్‌ నేతలు. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైవే రోడ్లు ధ్వంసమయ్యాయని.. వీటికి మరమ్మతులు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రతిపాదనలను.. గడ్కరీకి ఇచ్చామన్నారు నేతలు. వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని గడ్కరిని కోరారు.

Similar News