బూతులు మాట్లాడుతున్న మంత్రులపై పోలీసులు కేసులు పెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎర్రబాలెం పద్మజని అరెస్టు చేయడానికి వర్తించిన చట్టాలు మంత్రులకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. తనపై వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షిస్తా అని స్పీకర్ బెదిరిస్తున్నారని.. స్పీకర్ మాత్రం బూతులు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. భారత దేశంలో కొత్త తరహా చట్టాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు.