ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ నేటికీ తరగని అందంతో ఈతరం ప్రేక్షకుల హృదయాలను లూటీ చేస్తుంది అందాల నటి మాధురీ దీక్షిత్. అయిదు పదుల వయసులోనూ అందరి హృదయాలను కొల్లగొడుతున్న మాధురి అడపా దడపా సినిమాల్లో కనిపించినా తాజాగా నెట్ఫ్లిక్స్లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ నిర్మించే వెబ్ సిరీస్లో నటించేందుకు సిద్ధమయ్యారు. మాధురికి జోడీగా కరణ్ జోహార్ నటించనున్నారు. డిజిటల్ స్పేస్లో మాధురి తన సౌందర్యంతో మేజిక్ చేయనుంది అని కరణ్ పేర్కొన్నారు.