ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ యువతిపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన కరుణాకర్రెడ్డి అనే కీచకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అటు.. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.