రాయలసీమ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వేస్టేషన్లో రైలు ఇంజిన్ చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రైలును నిలిపివేశాడు. ప్రయాణికుల సహాయంతో నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. సుమారు మూడు గంటల పాటు తాడిపత్రిలోనే రైలును నిలిపివేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.