ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావంతో ముగ్గురు మరణించగా భారీగా ఆస్తినష్టం సంభవించింది. పెద్ద శబ్ధంతో భూకంపం రావడంతో ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికి పరుగులు తీశారు. దవావో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.