మూసీనదిని ప్రక్షాళన చేస్తామన్న హామీని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్. మూసీ ప్రక్షాళనోద్యమం పేరుతో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు... మూసీ నదిని మరో సబర్మతిలా మారుస్తామని చెప్పిన మాటలు నీటిమూటలే అయ్యాయని అన్నారు.. హైదరాబాద్కు మంచి నీరు అందిస్తోన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు లక్ష్మణ్.