తెలంగాణ హైకోర్టు బార్ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శారద గౌడ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్స్ యాక్ట్ సవరణ జరగకముందే బార్ కౌన్సిల్ ఏర్పాటు చెల్లదని పిటిషనర్ పేర్కొన్నారు. రూల్స్కు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలను వెంటనే రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు. అటు కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం... అడ్వకేట్స్ యాక్ట్లో సవరణ చేయలేదని తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో.. పిటిషన్పై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.