బాబు పాలనలో మద్యం ఏరులై పారిందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబుది విజన్ 2020 కాదు.. విజన్ 420 అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో టార్గెట్ పెట్టి చంద్రబాబు మద్యాన్ని అమ్మించారని అన్నారు. అయితే సీఎం జగన్ టార్గెట్ పెట్టి మద్యాన్ని నియంత్రించారని చెప్పారు.కూరగాయలు, నిత్యావసరాల రేట్లు పెరిగాయని ఎవరైనా ఆందోళన చేస్తారు.. కానీ చంద్రబాబు మంద్యం రేట్లు పెరగడంపై ఆందోళన చేస్తున్నారని అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. తరువాత ఆయన పెట్టిన మద్యపాన నిషేదానికి వెన్నుపోటు పొడిచారని అన్నారు రోజా.