సిద్ధిపేట డీసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేపట్టారు. మొత్తం 8 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 30 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్ధిపేటలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఓ ఖరీదైన విల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. సిద్ధిపేట చుట్టుపక్కల పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు.