తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. కాకినాడ జీజీహెచ్ వద్ద రోజుల వయసున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఓపీ రూమ్ వద్ద ఓ ప్లాస్టిక్ సంచిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాప క్షేమంగా ఉందన్నారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు పోలీసులు.