ఏపీ రాజధాని విషయంలో క్లారీటీగా ఉన్న వైసీపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను తిరిగి అసలు హక్కు దారులకే ఇచ్చేయాలని నిర్ణయించింది. అసైన్డ్భూములు ఇచ్చినందుకుగాను హక్కుదారులకు ఇవ్వాలని నిర్ణయించిన రిటర్న్బుల్ ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.