ఏపీలో సీఎం జగన్ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉంటే కులం, మతం తప్ప ఇంకేమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.. జగన్ నాయకత్వంలో రాజధాని మార్పు అనేది అభివృద్ధికి మంచిది కాదని విమర్శించారు. సీఎంగా జగన్ హాయంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించడం కలగానే మిగులుతుందన్నారు కన్నా.