రాజధానిపై GNరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 27న జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వమని మంత్రి స్పష్టం చేశారు..అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ను
ఆధారాలతో సహా బయటపెడుతామన్నారు..విశాఖలో భూములకు సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని టీడీపీకి సవాల్ విసిరారు మంత్రి బొత్ససత్యనారాయణ.