అమరావతి ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు వయసు సంబంధం లేకుండా ఆంతా ఆందోళనల్లో భాగమవుతున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించి తమ జీవితాలను నాశనం చేయొద్దని వారం రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఎండను లెక్కచేయక మోకాళ్లపై కూర్చొని నిరసనలో పాల్గొన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయొద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.