టాలీవుడ్ హీరో మహేష్బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫోటోషూట్లో అపశృతి చోటుచేసుకుంది. అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడంతో తోపులాట జరిగింది. మరోవైపు.. ఈ ఫోటోషూట్కు నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు కార్యక్రమాన్ని నిలిపివేశారు. మహేష్బాబు సైతం మధ్యలోనే వెళ్లిపోయారు. తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.