క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నారా లోకేశ్

Update: 2019-12-25 06:36 GMT

క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరులోని సెయింట్‌ మ్యాతివ్స్‌ చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ద్వేషాన్ని వదిలి సమాజంలో ప్రేమతో జీవించాలని లోకేశ్ అన్నారు . దేవుడు ఇచ్చిన శక్తిని సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దీనులకు , హీనులకు పేదలకు మన వంతు సాయం అందించాలని కోరారు. మన శత్రువుని కూడా మనం ప్రేమించే స్థాయికి రావాలని అప్పుడే జీసెస్ కరుణిస్తారని అన్నారు.

Similar News