రాజధాని అమరావతిలోనే ఉండాలి : టీడీపీ ఎంపీ కనకమేడల

Update: 2019-12-25 07:19 GMT

రాజధాని అమరావతిలోనే ఉండాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామన్నారు. మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన.. ఇక్కడి పరిస్థితి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎంలు శాశ్వతం కాదని.. రాజధాని అమరావతి శాశ్వతమని అన్నారు. విభజన నష్టం కంటే.. ఈ 6 నెలల్లో ఏపీకి జరిగిన నష్టం ఎక్కువని మండిపడ్డారు.

Similar News