సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆర్థికమంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఆ తరువాత పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారన్నదానిపై ఆరా తీశారు.
అయితే విద్యార్థుల్లో కొందరు తమ పేరును తెలుగులో కూడా సరిగ్గా రాయలేకపోయారు. అటు ఎక్కాలు అడిగినా చెప్పలేకపోయారు. దీంతో హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చదువు చెబితే వారు ప్రపంచంతో ఎలా పోటీ పడతారని ఉపాధ్యాయులను నిలదీశారు.