హైదరాబాద్లోని కంట్రీ క్లబ్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సినిమా నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతిపై దాడి జరిగింది. హెల్ప్ అడిగినందుకు పోలీసులు చితకబాదారని క్రాంతి చెప్తున్నాడు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోను హైడ్రామా చోటు చేసుకుంది. హుటాహుటిన పీఎస్కు చేరుకున్న నట్టికుమార్.. పోలీసులతో మాట్లాడి కుమారుడిని తీసుకెళ్లాడు. జరిగిన దానికి పోలీసులు సారీ చెప్పారని ఆయన అన్నారు.