రైతులపై దాడులు చేస్తున్న ఎలుగుబంట్లు, చిరుతపులులు

Update: 2020-01-03 11:11 GMT

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజవర్గంలో రైతులు ఎలుగుబంట్లు, చిరుతపులుల దాడులతో భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కంబదూరు మండలం మెళ్లాపురం గ్రామంలో దాసరి నరసింహులు అనే రైతు పొలంపనులు చేస్తుండగా... ఎగులుబంట్లగుంపు వచ్చి దాడికిపాల్పడ్డాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. రక్తశ్రావం కావడంతో చుట్టుపక్కల రైతులు నర్సింహులు ఆస్పత్రికి తరలించారు. తరుచూ ఎలుగుబంట్లు దాడులకు పాల్పడుతున్నా...వాటిని నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.

Similar News