వైసీపీ ఎంపీ ఇంటిని ముట్టడించిన అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు

Update: 2020-01-03 09:21 GMT

గుంటూరులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంటిని అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ముట్టడించారు. ఎంపీ ముందు కూర్చొని సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధప్రదేశ్.. అంటూ నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ఎంపీ ఇంటి ముట్టడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాల్సింది పరిపాలన వికేంద్రీకరణ మాత్రమేనని.. రాజధాని వికేంద్రీకరణ కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Similar News