జగన్మోహన్ రెడ్డి.. స్కూలు పిల్లాడిలా కుంటి సాకులు చెబుతున్నారు: అనూరాధ

Update: 2020-01-03 11:24 GMT

చిన్నపిల్లలు స్కూల్ కు వెళ్లకుండా కుంటిసాకులు చెప్పినట్లు.. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో కారణాలు చెపుతూ కోర్టుకు వెళ్లడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ అన్నారు. కుంటిసాకులు చెపుతూ ఇప్పటివరకు 33 శుక్రవారాలు న్యాయస్థానానికి ఎగ్గొట్టారని విమర్శించారు. ఫ్రైడే ఖైదీ అయిన ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెపుతున్న కుంటిసాకులను ఇప్పటికైనా న్యాయస్థానాలు గమనించాలని విజ్ఞప్తిచేశారు.

Similar News