రాజధాని అమరావతికి మద్దుతుగా హిందూ యువ శక్తి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసనల్లో హిందూ యువశక్తి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖలోని సహజవనరులపై ముఖ్యమంత్రి జగన్ కన్నుపడిందని.. అందుకే రాజధానిని విశాఖకు తరలించారని హిందూయువశక్తి రాష్ట్ర అధ్యక్షులు రజనీ కాంత్ విమర్శించారు.